Sunday, April 28, 2024

ప్రియురాలి పెళ్లి ఆపాలని సిఎంకే మొరపెట్టుకున్నాడు….

- Advertisement -
- Advertisement -

Bihar CM loses cool as media questions him

పాట్నా: ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలి పెళ్లి ఖరారు కావడంతో ప్రియుడు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. పెళ్లి ఆపేంత ధైర్యం లేకపోవడంతో ఏకంగా యువకుడు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కే ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లాక్ డౌన్ విధించడంతో బిహార్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. మరో పది రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నామని పేర్కొన్నారు. మే 16 నుంచి 25వ తేదీ వరకు లాక్ డౌన్ విధిస్తున్నామని సిఎం ప్రకటించారు. పెళ్లిళ్లపై నిషేధం విధిస్తే మే 19న జరగాల్సిన తన ప్రియురాలు పెళ్లి వాయిదా పడే అవకాశం ఉంటుందని సిఎంతో యువకుడు మొరపెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News