Wednesday, May 1, 2024

సింగరేణిలో ముగిసిన ప్రచారం

- Advertisement -
- Advertisement -

బరిలో 13 గుర్తింపు సంఘాలు

ఓటు హక్కు వినియోగించుకోనున్న 40వేల మంది కార్మికులు

రేపే పోలింగ్, సర్వం సిద్ధం, అదే రోజు ఓట్ల లెక్కింపు

మన తెలంగాణ/ ఖమ్మం బ్యూరో : సింగరేణి ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. తెలంగాణలోని ఆరు జిల్లాల పరిధిలో కొల్ బెల్ట్ ఏరియాలో హోరాహోరిగా ప్రచారం ముగిసింది. చివరి రోజు ప్రచారంలో హేమహేమినాయకులు పాల్గొన్నారు. కార్మికుల ఓట్లను అకట్టుకోవడానికి అధికారపార్టీ మంత్రులు సింగరేణి కార్మికులకు పలు వరాలను ప్రకటించి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు బుధవారం జరిగే పోలీంగ్‌కు సింగరేణి అధికారులు సర్వం సిద్దం చేశారు. ఉత్తర తెలంగాణలో గోదావరి తీరంలోని ఆరు జిల్లాల పరిధిలో 11 ఏరియాలో ఈ ఎన్నికల పోలీంగ్ జరగనుంది.

దాదాపు 40వేల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ సంస్థలో ఇప్పటి వరకు ఆరు పర్యాయాలు ఎన్నికలు జరుగగా వీటిలో అత్యధికంగా సిపిఐ అనుబంధ కార్మిక సంఘం ఎఐటియుసి మూడు సార్లు, కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టియుసి ఓసారి, బిఆర్‌ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రెండు సార్లు విజయం సాధించాయి. ఏడో పర్యాయం జరుగుతున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్‌టియుసితో పాటు బిఆర్‌ఎస్ అనుబంధ సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, సిపిఐ అనుబంధ కార్మిక సంఘం ఎఐటియుసి సంఘంతో పాటు మరో పది కార్మిక సంఘాలు గుర్తింపు హోదా కోసం పోటీ పడుతున్నాయి. సిఐటియు, బిఎంఎస్, హెచ్‌ఎంఎస్ జాతీయ సంఘాలు కూడా పోటీలో ఉండి తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News