Sunday, April 28, 2024

దేశం ఆర్‌ఎస్‌ఎస్ ఆధిపత్యంలోకి వెళ్తోంది: రాహుల్‌గాంధీ

- Advertisement -
- Advertisement -

The country is going to be dominated by the RSS

 

న్యూఢిల్లీ: దేశం ఆర్‌ఎస్‌ఎస్ నేతృత్వంలోని ఆధిపత్యశక్తుల చక్రబంధనంలోకి వెళ్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం కోసం మహాత్మాగాంధీ నేతృత్వంలో జరిగిన దండి సత్యాగ్రహం స్ఫూర్తితో మరోసారి పోరాడాలని రాహుల్ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా, ఉప్పుపై పన్ను విధించడాన్ని నిరసిస్తూ 1930మార్చి 12న సబర్మతి ఆశ్రమం నుంచి దండికి మహాత్మాగాంధీ నేతృత్వంలో పాదయాత్ర ప్రారంభమైన సందర్భాన్ని రాహుల్ గుర్తు చేశారు. దండియాత్ర ప్రపంచం మొత్తానికి స్వేచ్ఛా సందేశాన్నిచ్చిందని రాహుల్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. మనం అదే స్ఫూర్తితో ఇప్పుడూ పోరాడాల్సి ఉన్నదన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News