Wednesday, May 1, 2024

దేశానికి కెసిఆర్ అవసరం : పవార్

- Advertisement -
- Advertisement -

The country needs KCR: Pawar

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రస్తుతం దేశాన్ని అనేక సమస్యలు పట్టి పీడిస్తున్నాయని ఎన్‌సిపి జాతీయ అధ్యక్షులు శరద్ పవార్ అన్నారు. నిరుద్యోగం, ఇంధన ధర లు ఇలా చెప్పుకుంటూ పోతే మోడీ సర్కారు అన్ని రంగా ల్లో విఫలమైందని ఆరోపించారు. తెలంగాణ అనేక సం క్షేమ పథకాలు విజయవంతంగా అమలు అవుతున్నాయ ని కితాబిచ్చారు. దేశ అభివృద్ధికి కెసిఆర్ లాంటి నేతలు చాలా అవసరమన్నారు. అందుకే కెసిఆర్‌తో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. దీని కోసం ప్రత్యేకంగా కార్యచరణ ప్రణాళికను రూపొందిస్తామన్నారు. బిజెపియేతర పార్టీలన్నింటిని ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చే విధంగా తమ ప్రణాళిక ఉంటుందన్నారు. త్వరలో నే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. అంతకు ముందు ముఖ్యమంత్రి సిఆర్ మాట్లాడుతూ దేశాభివృద్ధికి కొత్త ఎజెండాను రూపొందించాల్సి న అవసరం చాలా ఉందన్నారు. మోడీ హయంలో దేశం అన్ని రంగాల్లో పూర్తిగా పతనమైందని విమర్శించారు. బిజెపి సర్కార్ దేశ ప్రగతిపై దృష్టి సారించకుండా రాష్ట్రాల హక్కులను హరించే విషయానికే అధిక ప్రాధాన్యతను ఇస్తోందన్నారు.

దీని కారణంగా దేశంలో ప్రస్తుతం ఫెడరల్ వ్యవస్థకు తీవ్ర విఘాతం ఏర్పడిందన్నారు. బిజెపియేతర ప్రభుత్వాల పట్ల మోడీ సర్కార్ వివక్ష కొనసాగిస్తూ… అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందని సిఎం కెసిఆర్ మండిపడ్డారు. అందుకే దేశాభివృద్ధికి కొత్త ఎజెం డా రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. మహారాష్ట్ర సిఎం తో భేటీ ముగిసిన అనంతరం సౌత్ ముంబైలోని నేపియన్ సి రోడ్డులో గల ఎన్‌సిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ సిఎం, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ నివాసానికి వెళ్లారు. సిఎం కెసిఆర్ బృందాన్ని శరద్ పవా ర్ కూతురు, ఎంపీ సుప్రియా సూలే సాదరంగా ఆహ్వానించారు. తదనంతరం శరద్ పవార్‌తో సిఎం కెసిఆర్ సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాలు దేశ వ్యవసాయ రంగం తదితర దేశ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. దేశంలో నెలకొన్న తాజా రాజకీయాలపై వారు తమ తమ అభిప్రాయాను పంచుకున్నారు. ప్రధానంగా కేంద్రంలోని బిజెపి సర్కారు రాష్ట్రాల పట్ల అనుసరిస్తునన వివక్ష, రాష్ట్రాలపై పెత్తనం తదితర విషయాలపై చర్చించారు. ఇందుకు వ్య తిరేకంగా మోడీ సర్కారుపై గట్టిగా పోరాడాలని నిర్ణయించారు.

అనంతరం జరిగిన మీడియా సమావేశంలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, అతిపిన్న వయస్సులో సిఎంగా పనిచేసిన నేత, భారత రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్న నేతగా శరద్ పవార్‌ను అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శరద్ పవార్ ఇచ్చిన మద్దతును ఎప్పటికి మర్వలేమన్నారు. 1969 నుంచి తెలంగాణ పవార్ మద్దతుగా ఉన్నారన్నారు. ఇందుకు శరద్ పవార్‌కు తెలంగాణ ప్రజల తరఫున తన తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానని సిఎం కెసిఆర్ అన్నారు. దేశంలో పాల న సరైన రీతిలో సాగడం లేదని, స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా అనుకున్న రీతిలో అభివృద్ధి జరుగలేదని విమర్సించారు. దానికోసం ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్నారు. అందుకే తాము కలిసి పనిచేయాల్సిన విషయంపై ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. భావసారూప్యం గల పార్టీల నేతలతో త్వరలో సమావేశం నిర్వహిస్తామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. దేశంలో విశేష అనుభవం ఉన్న నేత శరద్ పవార్….. మోడీ సర్కారుపై చేపట్టిన తమ పోరాటానికి మద్దతుగా నిలిచి ఆశీర్వదించారని సిఎం కెసిఆర్ చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News