Sunday, April 28, 2024

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బైక్: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా తొండంగి మండలంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొత్త ముసలయ్య పేట వద్ద ట్రాక్టర్‌ను బైక్ ఢీకొట్టడంతో ముగ్గురు చనిపోయారు. ముగ్గురు బైక్‌పై ఒంటిమామిడి నుంచి శ్రీరామ్‌పూరం వెళ్తుంగా ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  మృతులు యు కొత్తపల్లి మండలం శ్రీరామ్‌పురం గ్రామస్థులుగా గుర్తించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News