Tuesday, April 30, 2024

ముక్కోటి వృక్షార్చన పోస్టర్ విడుదల….

- Advertisement -
- Advertisement -

Three crores trees planted in KTR Birth Day

హైదరాబాద్: ఈ నెల 24వ తేదీన పురపాలక శాఖ మంత్రి, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా ముక్కోటి వృక్షార్చనలో భాగంగా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి కెటిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని, అసెంబ్లీ ఆవరణలో ముక్కోటి వృక్షార్చన పోస్టర్ ను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్   ఆవిష్కరించారు.

జూలై 24వ తేదీన పురపాలక శాఖ మంత్రి ,టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు పుట్టినరోజును పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ఉపయోగకరమైన ఒక గ్రీన్ డే గా జరపాలని గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకులు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్  తెలంగాణ వ్యాప్తంగా ఒకే గంటలో మూడు కోట్ల మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.  ఈనెల 24వ తేదీన నిర్వహించే ముక్కోటి వృక్షార్చనలో ప్రతి ఒక్కరూ పాల్గొని మూడు మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వినయ్ భాస్కర్ కోరారు. అసెంబ్లీ ఆవరణలోని తన కార్యాలయంలో ముక్కోటి వృక్షార్చనకి సంబంధించిన పోస్టర్, కరపత్రాలను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విడుదల చేశారు.

పోస్టర్ ఆవిష్కరణలో మాజీ ఎమ్మెల్యే దొనెపూడి రమేష్ బాబు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుందర్ రాజ్ యాదవ్, పొడిశెట్టి అనిల్, తాళ్ళపల్లి జనార్దన్, లక్ష్మణ్‌, ప్రకాష్, రోహిత్ సింగ్‌, వేణు మాధవ్, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News