Thursday, May 2, 2024

దైవ దర్శనానికి వెళ్తామని చెప్పి…. ముగ్గురు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Three members commit suicide in Mahaboobnagar

మహబూబ్ నగర్: దైవ దర్శనానికి వెళ్తున్నామని చెప్పి ముగ్గురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మృతులలో తల్లి, కుమారుడు, కూతురు ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బాలకిష్టమ్మ అనే మహిళ పండ్ల వ్యాపారం చేస్తూ దేవరకద్రలో నివసిస్తున్నారు. ఆమెకు కమారుడు రాజు, కూతురు సంతోష ఉంది. వారం రోజుల నుంచి బాలకిష్టమ్మ అనారోగ్యం బాగోలేదు. లాక్ డౌన్ కారణంగా వ్యాపారంలో ఆమెకు నష్టం వచ్చింది. దాయాదులతో ఆస్తి తగాదాలతో పాటు ఆర్థిక సమస్యలు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. మన్యం కొండ గుడికి వెళ్తున్నామని బంధువులకు మే-24న చెప్పి మళ్లీ ఇంటికి రాలేదు. చౌదర్ పల్లి గుట్టపై మొక్కలకు నీరు పోయడానికి వెళ్లిన కూలీలకు మూడు మృతదేహాలు కనిపించడంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేయగా వారు ఆత్మహత్య చేసుకున్నారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మృతదేహాల నుంచి వాసన వస్తుండడంతో రెండు రోజుల క్రితం వారు ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News