- Advertisement -
ఢిల్లీ: ఢిల్లీలోని వజిరాబాద్ రహదారిపై నంద్ నగరి డిపో ఎదుట బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టిన అనంతరం దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ తప్పిదంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నామని డిసిపి వేద ప్రకాశ్ సూర్య తెలిపారు. మృతులు రవీందర్ (22), కరణ్(12), ఇంకా ఒక్కరిని గుర్తించలేదని పోలీసులు వెల్లడించారు.
- Advertisement -