- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలో ప్రతీరోజు రెండు వేలకు పైగా కేసుల నమోదవుతున్నాయి. గురువారం ఒక్క రోజే తెలంగాణలో 2381 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా పది మంది మృత్యువాతపడ్డారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 1.81 లక్షలకు చేరుకోగా 1080 మంది చనిపోయారు. కరోనా బారి నుంచి 1.5 లక్షల మంది కోలుకోగా 30 వేల మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్క రోజే 57 వేల మందికి కరోనా టెస్టులు చేయగా మొత్తం టెస్టుల సంఖ్య 27.41 లక్షలుగా ఉంది. జిహెచ్ఎంసి (386) పరిధిలోని అత్యధిక కేసులు నమోదయ్యాయి
- Advertisement -