Sunday, April 28, 2024

సాగర్ కాలువలో పడి ముగ్గురు గల్లంతు…

- Advertisement -
- Advertisement -

Three Members missing in Khammam

ముదిగొండ: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కట్టకూరు వద్ద మంగళవారం ఉదయం సాగర్ కాలువలో పడి ముగ్గురు గల్లంతయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులు వరి కోయడానికి వరి కోత మిషన్ తో ఖమ్మం జిల్లాకు వచ్చారు. కట్టకూరు ప్రాంతం వరి కోస్తూ అక్కడే ఉంటున్నారు. వరి కోసిన అనంతరం సాగర్ కాలువ పక్కన బహిర్భూమికి వెళ్లారు. ప్రమాదవశాత్తూ సాగర్ కాలువలో ఒకరు జారిపడడంతో మరో ఇద్దరు కాపాడబోయి ముగ్గురు గల్లంతయ్యారు. రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News