Sunday, April 28, 2024

ఎంపి సంతోష్ బర్త్ డే వేడుకలు….

- Advertisement -
- Advertisement -

MP Santhosh Kumar birth day celebrations

హైదరాబాద్: తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొక్కలు నాటారు.  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి,  టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త పాల్గొన్నారు. ఇవాళ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త  పాల్గొని మొక్కలు నాటడం జరిగింది.

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం భాగంగా మంగళవారం హైదరాబాద్ లోని ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని ఉప్పల్ భాగాయత్ లో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి తన పుట్టి రోజు సందర్భంగా  కేక్ కటింగ్ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా.. ఉప్పల్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా కొన్ని వందల మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు వేడుకలు సందర్భంగా వారికి ఘన స్వాగతం పలికారు. తదనంతరం కేక్ కటింగ్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ.. సిఎం కెసిఆర్ చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం స్పూర్తితో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పెద్దల అందరి మన్నలను పొందుతు అందరినీ ఆకర్షిస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నారు. ఈరోజు
తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటి అందరికీ ఆదర్శంగా నిలిచారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ దేశంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గ్రీనరీని ప్రోత్సహిస్తున్న సంతన్నకు ఈ సందర్భంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంఎల్ సి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రావు, టిఎస్ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు, మాజీ బిసి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆర్గనైసర్ రాఘవ,
బన్నాల గీత ప్రవీణ్ కుమార్ ముదిరాజ్ చిలకా నగర్ 7వ డివిజన్ కార్పొరేటర్, ఉప్పల్ డివిజన్ అధ్యక్షుడు వేముల సంతోష్ రెడ్డి, యువ డైరెక్టర్ పూర్ణ, వివిధ డివిజన్ స్థాయి అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు మహిళా సంఘాల నాయకులు, ఉప్పల సాయి కిరణ్, ఉప్పల సాయితేజ, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News