Thursday, May 2, 2024

ఉప్పల్ లో న్యూజిలాండ్-భారత్ తొలి వన్డే.. అందుబాటులో టికెట్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ఉప్పల్ వేదికగా ఈ నెల 18న న్యూజిలాండ్ తో భారత్ తొలి వన్డే నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్ కు క్రికెట్ అభిమానులు ఆన్ లైన్ టికెట్లు బుకింగ్ చేసుకున్నారు. జింఖానా గ్రౌండ్ ఘటనతో హెచ్ సిఎ అప్రమత్తమయ్యారు. టికెట్ల పంపిణి సమయంలో తొక్కిసలాట జరగకుండా జాగ్రత్తలు చేపట్టారు. గచ్చిబౌలి స్టేడియంలో సెక్షన్ల ప్రకారం 8 కౌంటర్లలో టికెట్ల పంపిణి చేపట్టారు. ఈ రోజు గచ్చిబౌలి, ఎల్బీ స్టేడియంలో టికెట్ల పంపిణి చేపట్టారు. మద్యాహ్నం 3 గంటల వరకు టికెట్లు పంచనున్నారు. స్టేడియం దగ్గర బారికేడ్లతో పాటు పోలీసు, ప్రైవేట్ బౌన్సర్లతో బందోబస్తు ఏర్పాటు చేశారు. భారత్ తో న్యూజిలాండ్ మూడు వన్డేలు, మూడు టీ 20 మ్యాచ్ లు ఆడనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News