Saturday, April 27, 2024

తిరుమలలో బోనులో చిక్కిన మరో చిరుత

- Advertisement -
- Advertisement -

తిరుమల: అలిపిరి కాలినడక మార్గంలో మరో చిరుత బోనులో చిక్కింది. ఏడో నంబర్ మైలు వద్ద బోనులో చిరుత చిక్కింది. పలు మార్గాల్లో టిటిడి బోన్లు ఏర్పాటు చేసింది. అలిపిరి కాలినడక మార్గంలో ఇప్పటికే రెండు చిరుతలు పట్టుబడ్డాయి. ఆగస్టు 11న తిరమల కాలినడక మార్గంలో అలిపిరి వద్ద భక్తులపై చిరుత దాడి చేయడంతో ఆరేళ్ల బాలిక మృతి చెందింది. జూన్ 22న నడక మార్గంలో వెళ్తున్న బాలుడిని చిరుత లాక్కెళ్తుండగా భక్తులు కేకల వేయడంతో బాబు అక్కడే పడేసి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. మొత్తం ఐదు చిరుతలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు మూడు చిరుతలను బంధించారు. మరో రెండు చిరుతల కోసం బోన్లు ఏర్పాటు చేశారు.

Also Read: తిరుమలలో చిక్కిన మరో చిరుత

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News