- Advertisement -
తిరుమలః మహమ్మారి కరోనా వైరస్ కారణంగా మూసివేసిన తిరుమల దేవస్థానాన్ని దాదాపు 75 రోజుల తర్వాత టిటిడి తిరిగి ప్రారంభించింది. ఈ సందర్భంగా స్వామి ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సోమవారం నుంచి ప్రారంభమైన శ్రీవారి దర్శనాలకు మొదటి రెండు రోజులు టిటిడి ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించారు. ఈ నెల 10వ తేదీన స్థానికులకు, 11వ తేది నుంచి భక్తులందరికీ దర్శనం కల్పించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఉదయం 6.30 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు శ్రీవారిని దర్శించుకునేలా.. గంటకు 500మంది చొప్పున రోజుకు 6వేల మందికి అవకాశం కల్పించాలని టిటిడి నిర్ణయించింది.
Tirumala Srivari Temple Reopen from Today
- Advertisement -