Thursday, May 2, 2024

తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు అన్ని కంపార్టుమెంట్లలో వేచి చూస్తున్నారు. స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టిటిడి అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనానికి 6 గంటలు, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించకుంటున్నారు.

కాగా, శనివారం శ్రీవారి 59,734మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో నిన్న 30,654 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.25కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News