పీపుల్ స్టార్ ఆర్.నారాయణమూర్తి ప్రస్తుతం ఏపీలో థియేటర్ల పరిస్థితిపై మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. “ప్రపంచ సినిమా ఈరోజు టాలీవుడ్ వైపు చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పరిస్థి తుల్లో ఆంధ్రప్రదేశ్లో థియేటర్లు మూసి వేస్తున్నారని తెలిసి ఏడుపొచ్చింది. ఇటు వంటి దుస్థితి వచ్చినందుకు చాలా బాధ పడుతున్నాను. అందుకే నేనొక విజ్ఞప్తి చేస్తున్నాను. ఫిల్మ్ ఛాంబర్ పెద్దలని, ప్రొడ్యూసర్ కౌన్సిల్ పెద్దలని, మా అసో సియేషన్ పెద్దలని, దిల్ రాజు, అల్లు అర వింద్, సురేష్ బాబు, చిరంజీవి, నాగార్జున, నాని.. ఇలా ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే థియేటర్ల యజమానులకు కూడా చెబుతున్నా.. ‘ఎందుకు థియేటర్లు మూసే స్తున్నారు మీరు. మూసేయకండి.. అక్కడ ఎమ్మెల్యేలనో, ఎంపిలనో కలవండి. ఈ విషయాలను ఏపి సిఎం జగన్ మోహన్రెడ్డి దగ్గరకు తీసుకెళ్లండి. ప్రభుత్వానితో పాజిటి వ్గా ఉండండి. నెగిటివ్గా చూడవద్దు.. ఎమోషన్ అవ్వవద్దు. సినిమా తల్లిని కాపా డుకోవాలి మనం. దయచేసి థియేటర్లు మూసేయవద్దు. అలాగే వాళ్ల ఆవేదన ఏంటి? ఆవేశం ఏంటి.. అని పెద్దలతో చర్చిం చి, ఏపి సిఎంజగన్ను కలిసి సమస్యను పరిష్కరించి.. అన్ని థియేటర్లు తెరుచుకు నేలా చేయాలి”అని విజ్ఞప్తి చేస్తున్నాను.
సినీ పెద్దలకు ఇదే నా విజ్ఞప్తి
- Advertisement -
- Advertisement -
- Advertisement -