Saturday, July 27, 2024

నగరంలో రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 17,18 తేదీల్లో హైదరాబాద్‌కు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు. ఈనెల 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బేగం పేట ఎయిర్ పోర్టుకు రానున్నారు. అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లనున్న నేపధ్యంలో రాత్రి 7.40 గంటల నుంచి 8.10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. రసూల్‌పుర, పిఎన్‌టి జంక్షన్, బేగంపేట, గ్రీన్స్‌ల్యాండ్, మోనప్ప జంక్షన్, రాజ్‌భవన్ ఎంఎంటిఎస్ జంక్షన్, మెట్రో రెసిడెన్సీ లేన్, వివి స్టాట్యూ జక్షన్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 18వ తేదీన ప్రధాన నరేంద్ర మోదీ రాజ్‌భవన్ నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లనున్నారు. ఉదయం 9.50 గంటల నుంచి 10.20 గంటలకు వరకు వివిస్టాట్యూ జంక్షన్, మెట్రో రెసిడెన్సీ లేన్, ఎంఎంటిఎస్ రాజ్‌భవన్, పంజాగుట్ట, గ్రీన్స్‌ల్యాండ్, హెచ్‌పిఎస్ ఔట్ గేట్, బేగంపేట ఫ్లైఓవర్, పిఎన్‌టి ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్‌ను ఆపివేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News