Tuesday, May 14, 2024

మరో పదేళ్లు రిజర్వేషన్లు పొడిగింపు..

- Advertisement -
- Advertisement -

TS Govt Extends Reservations for 10 years

మనతెలంగాణ/హైదరాబాద్: వెనుకబడిన తరగతుల అన్ని వర్గాలకు రిజర్వేషన్ ప్రయోజనాలు మరో పదేళ్ల పాటు రాష్ట్ర పరిపాలన విభాగం పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. బిసి కులాలతో పాటు వికలాంగులు, వయోవృద్ధులకు సంబంధిత రిజర్వేషన్లు, నియమాకాలు, వయో పరిమితి, ఇతర ప్రయోజనాలను 2031 సంవత్సరం మే 31వ తేదీ వరకు అమలు చేసేలా ఆదేశాలిచ్చారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇతర సంస్థలు చేపట్టే నియమాకాలు, ఇతర ప్రయోజనాల వర్తింపునకు మరో పదేళ్ల పాటు బిసిలు, వికలాంగులు అర్హులని పేర్కొన్నారు.

TS Govt Extends Reservations for 10 years

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News