- Advertisement -
హైదరాబాద్: 87 మున్సిపాలిటీల్లో టిఎస్ బిపాస్ విధానం ప్రవేశపెట్టామని మంత్రి కెటిఆర్ తెలిపారు. టిఎస్ బిపాస్పై మంత్రి కెటిఆర్ సమీక్షలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జూన్ మొదటి వారంలో తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీల్లో టిఎస్ బిపాస్ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉంచాలని సూచించారు. టిఎస్ బిపాస్లో భాగస్వాములైన సిబ్బందికి శిక్షణ, అవగాహన కార్యక్రమాలు ముమ్మరం చేయాలని కెటిఆర్ కోరారు. టిఎస్బిపాస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రజులు ఆన్లైన్లో అనుమతులు పొందేందుకు వీలు ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి, పురపాలక,హెచ్ఎండిఎ అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -