మనతెలంగాణ/హైదరాబాద్: జాతీయ స్థాయి టగ్ ఆఫ్ వార్ బీచ్ చాంపియన్షిప్లో పురుషులు, మహిళల విభాగంలో తెలంగాణ జట్లు టైటిల్స్ సాధించాయి. అంతేగాక అండర్19 మిక్స్డ్ టీమ్ విభాగంలో కూడా తెలంగాణ జట్టు విజేతగా నిలిచింది. మహారాష్ట్రలోని పాల్గర్ బీచ్లో ఈ పోటీలు జరిగాయి. ఈ చాంపియన్షిప్లో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన జట్టు పాల్గొన్నాయి. మిక్స్డ్ టీమ్ విభాగం ఫైనల్లో తెలంగాణ 30తో రాజస్థాన్ ను ఓడించింది. ఇక సీనియర్ పురుషుల విభాగంలో తెలంగాణ 30 తేడాతో గుజరాత్ను ఓడించి టైటిల్ను సొంతం చేసుకుంది. మహిళల విభాగంలో కూడా తెలంగాణకు టైటిల్ దక్కింది. ఫైనల్లో సీనియర్ మహిళల టీమ్ 30 తేడాతో ఆతిథ్య మహారాష్ట్రను ఓడించింది. ఇక విజేతగా నిలిచిన జట్లకు టగ్ ఆఫ్ వార్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు హరిశంకర్ ప్రసాద్ గుప్తా, కార్యదర్శి మాధవి పటేల్ టైటిల్స్ను అందజేశారు.
TS teams won Tug of War Beach Championship 2021