Saturday, May 4, 2024

హార్దిక్ పాండ్యా, రషీద్‌ఖాన్ లకు షాక్..

- Advertisement -
- Advertisement -

ముంబై: వచ్చే ఏడాది జరిగే ఐపిఎల్ కోసం తాము అంటిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను ఆయా ఫ్రాంచైజీలు విడుదల చేశాయి. ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రిత్ బుమ్రా, కీరన్ పొలార్డ్‌లను అంటిపెట్టుకుంది. ఇక హార్దిక్, బౌల్ట్, ఇషాన్ కిషన్‌లను వదిలిపెట్టింది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్‌కు షాక్ ఇచ్చింది. అతన్ని ఎస్‌ఆర్‌హెచ్ విడుదల చేసింది. కేన్ విలియమ్సన్‌తో పాటు ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్‌లను అట్టిపెట్టుకుంది. అంతేగాక డేవిడ్ వార్నర్‌ను కూడా జట్టు వదులుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్, అక్షర్ పటేల్, నోర్జే, పృథ్వీషాలను రిటైన్ చేసుకోగా శ్రేయస్ అయ్యర్, అశ్విన్, రహానెలను విడుదల చేసింది. రాజస్థాన్ సంజు శాంసన్, బట్లర్, యశస్విలకు మరో ఛాన్స్ ఇచ్చింది. పంజాబ్ కింగ్స్ రాహుల్‌ను వదులుకుంది. మయాంక్, అర్ష్‌దీప్‌లను అంటిపెట్టుకుంది. బెంగళూరు కోహ్లితో పాటు సిరాజ్, మాక్స్‌వెల్‌లను రిటైన్ చేసుకుంది. చెన్నై ఊహించినట్టే ధోనితో పాటు జడేజా, రుతురాజ్, మొయిన్ అలీలను రిటైన్ చేసుకుంది. కోల్‌కతా వెంకటేశ్ అయ్యర్, రసెల్, నరైలను అంటిపెట్టుకుంది.

MI Retained Rohit and Bumrah for IPL 2022

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News