Tuesday, April 30, 2024

రెండు బైకులు ఢీ

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట:రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొన్న సంఘటన చివ్వెంల మండల పరిధిలోని దురాజ్‌పల్లి శివారులో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పెన్‌పహాడ్ నుంచి గాజలు మల్కాపురం గ్రామానికి చెందిన బచ్చలకూరి ప్రవీణ్ బైక్ పై సూర్యాపేట వైపు వస్తుండగా, సూర్యాపేటకు చెందిన నిమ్మల శేఖర్ పెన్‌పహాడ్ వైపు తన ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా దురాజ్‌పల్లి శివారులో ప్రతిష్ట ఫార్మసి కళాశాల ఎదరుగా రెండు బైకులు ఎదురెదురుగా ఢి కొన్నాయి. నిమ్మల శేఖర్‌కు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం స్థానికులు సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News