Thursday, May 2, 2024

నిమజ్జనంలో ఇద్దరి మృతి..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః వినాయకుడి నిమజ్జనం సందర్భంగా జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు భక్తులు మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం… సంజీవయ్య పార్కు వద్ద గణపతిని తీసుకుని వెళ్తున్న వాహనం కింద ఓ బాలుడు ప్రమాదవశాత్తు పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కిషన్‌బాగ్‌కు చెందిన ప్రణీత్‌కుమార్ గణేస్ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు లారీ హుస్సేన్‌సాగర్‌కు తరలిస్తున్నారు. లారీ ముందుకు కదులుతుండగా బాలుడు కిందపడిపోయాడు. దీంతో లారీ వెనుక టైరు బాలుడిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

మరో ప్రమాదంలో బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు మృతిచెందాడు. బెల్లంపల్లికి చెందిన రాజశేఖర్ కుటుంబం నగరంలోని సంతోష్‌నగర్ ప్రెస్ కాలనీలో నివాసముంటోంది. గణేష్ నిమజ్జనం కోసం ద్విచక్ర వాహనంపై కుటుంబంతో కలిసి హుస్సేన్‌సాగర్‌కు బయలుదేరారు. బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వద్దకు రాగానే బైక్ అదుపు తప్పడంతో వారంతా కిందపడ్డారు. ఈ క్రమంలోనే బాలుడు ఆయుష్(4)పై నుంచి మరో వాహనం వెళ్లింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని వెంటనే నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. బాలుడు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతిచెందాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News