Sunday, May 5, 2024

మన్యంలో గోడకూలి ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన్యం జిల్లా పార్వతీపురం మండలం నర్సీపురంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి గోడ కూలి తల్లి సత్తెమ్మ(50), కుమార్తె గంగ(24) మృతి చెందారు. ఈ నెల 23న అర్థరాత్రి తల్లి, కమార్తె గాఢ నిద్రలో ఉండగా ఇంటి గోడ కూలిపోయింది. కాలనీ శివారులో ఇల్లు ఉండటంతో ఆలస్యంగా ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శిథిలావస్థకు చేరిన ఇంటిలో నివాసం ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని గ్రామస్థులు తెలిపారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: నిజం గెలిస్తే బాబు జైల్లోనే ఉంటారు భువనేశ్వరి: కొడాలి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News