Friday, May 3, 2024

లారీ బీభత్సం.. ఇద్దరు పోలీసులు మృతి

- Advertisement -
- Advertisement -

Two policemen killed in road accident in AP

అమరావతి: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం ఉండూరు వద్ద శుక్రవారం రోడ్డుప్రమాదం జరిగింది. ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు పోలీసులు మృతిచెందారు. వంతెన వద్ద ఇద్దరు పెట్రోలింగ్ పోలీసులపైకి లారీ దూసుకెళ్లింది. మృతులను హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, హోంగార్డు ఎన్. ఎస్. రెడ్డిగా గుర్తించారు. కాకినాడు తిమ్మాపురం పిఎస్ లో వీరు విధులు నిర్వహిస్తున్నారు. విజయవాడ నుంచి వెళ్తున్న కోవిడ్ వ్యాక్సిన్ వాహనానికి ఎస్కార్ట్ గా వెళ్లేందుకు పోలీసులు వేచి ఉన్నట్టు అధికారులు తెలిపారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఉంటూరు వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Two policemen killed in road accident in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News