Sunday, April 28, 2024

సమాజ్‌వాదీ పార్టీలో చేరిన సిట్టింగ్ ఎంఎల్‌ఏలు

- Advertisement -
- Advertisement -

Two sitting MLAs join Samajwadi Party

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు(2022) జరగడానికి ముందు ఇద్దరు సిట్టింగ్ ఎంఎల్‌ఏలు ఆదివారం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పి)లో చేరారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సమక్షంలో సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యాలయంలో వారు తీర్థం పుచ్చుకున్నారు. గోరఖ్‌పూర్‌లోని చిల్లూపర్ అసెంబ్లీ సీట్ ఎంఎల్‌ఏ వినయ్ శంకర్ తివారీ(బిఎస్‌పి), సంత్ కబీర్ నగర్‌లోని ఖలీలాబాద్ కు చెందిన దిగ్విజయ్ నారాయణ్ అలియాస్ జై చౌబే (బిజెపి) ఎస్‌పిలో చేరిపోయారు. ఉత్తర్‌ప్రదేశ్ శాసన మండలి మాజీ చైర్మన్ గణేశ్ శంకర్ పాండే సైతం సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఆయన బిఎస్‌పికి చెందిన వ్యక్తి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News