Thursday, May 2, 2024

శ్రీనగర్ లో ఎన్‌కౌంటర్… ఇద్దరు ఉగ్రవాదులు హతం….

- Advertisement -
- Advertisement -

Two terrorist dead in Srinagar

 

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్ ప్రాంతం అలమ్‌దార్ కాలనీ, దన్మార్‌లో శుక్రవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. తీవ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. తీవ్రవాదులు సంచరిస్తున్నారని సమాచారం రావడంతో గాలింపు చర్యలు చేపట్టామని కశ్మీర్ ఐజిపి విజయ్ కుమార్ తెలిపాడు. దీంతో భద్రతా బలగాలు కదలికలను గమనించిన తీవ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు చనిపోయారని ఐజిపి పేర్కొన్నారు. ఘటనా స్థలం నుంచి మందు గుండు సామాగ్రి, ఎకె-47 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News