Monday, April 29, 2024

పుల్వామాలో కాల్పులు: ఎస్‌పిఒ, భార్య మృతి

- Advertisement -
- Advertisement -

Two Members dead in pulwama attack

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు కాల్పులకు తెగపడడంతో ఎస్‌పిఒ చనిపోయాడు. తీవ్రవాదులు ఎస్‌పిఒ ఫయాజ్ అహ్మద్ ఇంట్లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఫయాజ్, భార్య, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫయాజ్, భార్య కన్నుమూశారు. కూతురు ఐసియులో చికిత్స పొందుతున్నారు. గతంలో శ్రీనగర్‌లోని మెంగన్‌వాజీ నౌగమ్ ప్రాంతంలో ప్రార్థనాలకు వెళ్తున్న పోలీస్ అధికారి పర్వేజ్ అహ్మాద్‌పై గుర్తు తెలియని తీవ్రవాదులు కాల్పులకు తెగపడ్డారు. గత నెలలో పోలీస్ అధికారి జావైద్ అహ్మద్‌పై కాల్పులు జరపడంతో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అమరులయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News