Saturday, April 27, 2024

గోదావరి నదిలో నలుగురు గల్లంతు

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: గోదావరి నదిలో నలుగురు గల్లంతైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా గన్నవరం మండలంలో జరిగింది. మూడు మృతదేహాలు లభ్యంకాగా మరో మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పదో తరగతికి చెందిన బండారి నవీన్ కుమార్(15), పంతాల నవీన్(15). ఖండవల్లి వినయ్(15), యర్రంశెట్టి రత్న సాగర్(15) గోదావరి నదీ తీరాన ఆడుకునేందుకు వెళ్లారు. నలుగురు నదిలోకి దిగడంతో మునిగిపోయారు. ఆదివారం రాత్రి 7 గంటలు అవుతున్న పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు గాలింపు చర్యలు చేపట్టారు. నదీ ఒడ్డున ఇసుక తిన్నెలో సైకిల్, వారి దుస్తువులు కనిపించడంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. మూడు మృతదేహాలు లభించగా వినయ్ మృతదేహం కోసం గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News