Thursday, May 2, 2024

కశ్మీరులో ఇద్దరు ఉగ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

Two terrorists killed in Kashmir

శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని అనంత్‌నాగ్ జిల్లాలో మంగళవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో భద్రతా దళాలు అనంత్‌నాగ్ జిల్లాలోని పోష్‌క్రీరి ప్రాంతంలో తనిఖీలు నిర్వహించగా వారిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని వారు చెప్పారు. వారిని ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందినవారిగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News