మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల కలలు సాకారం చేసే దిశగా అడుగులు వేస్తోందని, ఎవరూ వెనుకబడకుండా అందరికీ సమా న అవకాశాలు ఇవ్వడమే తమ సంకల్పమని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు. తెలంగాణ మైనారిటీల సంక్షేమం కో సం కాంగ్రెస్ ప్రభుత్వం మరో చారిత్రాత్మక అడుగు వేసిందని అన్నారు. సచివాలయంలో రెండు కొత్త పథకాలను శుక్రవారం లాంచనంగా ఆయన ప్రారంభిం చారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన, రేవంతన్నా కా సహారా – మిస్కీన్ల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రక్రియకు సంబంధించిన పోర్టల్ను ఏర్పాటు చేసిన ట్లు మంత్రి వెల్లడించారు. ఈ రెండు పథకాలను ము స్లిం మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వితంతువులు, విడాకులు పొందినవారు, అనాధలు, అవివాహిత మహిళలు చిన్న వ్యా పారాలు మొదలుపెట్టి స్వయం ఉపాధి పొందేలా ఇం దిరమ్మ యోజన తోడ్పడుతుందని తెలిపారు. ఫఖీర్, దుదేకుల వర్గాలకు మోపెడ్ వాహనాలు ఇవ్వడం వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తుందని అన్నారు.
రెండు పథకాలకు రూ.30 కోట్లు
ఈ రెండు పథకాలకే ప్రభుత్వం రూ.30 కోట్లు కేటాయించడం మైనారిటీల పట్ల అంకితభావానికి నిదర్శనమని స్పష్టం చేశారు. తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించి రెండు నెలలు పూర్తయిన కొద్ది రోజుల్లోనే ఇలాంటి కొత్త పథకాలు ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. లబ్ధిదారులు ఈ సా యాన్ని కుటుంబాభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్, వక్ఫ్ బోర్డు చై ర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ, గ్రంథాలయాల చైర్మన్ డా. రియాజ్, కో-ఆపరేటివ్ యూనియన్ చైర్మ న్ మనలా మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.