Thursday, May 2, 2024

టీచర్ పై విద్యార్థి కత్తితో దాడి….

- Advertisement -
- Advertisement -

knife

 

లక్నో: ఏడో తరగతి విద్యార్థి స్కూల్ టీచర్ పై కత్తితో దాడి చేసి పారిపోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని కకోరీ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టీచర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శ్యామ్ గుప్తా అనే ఉపాద్యాయుడు  ఏడో తరగతికి క్లాస్ టీచర్ గా ఉన్నాడు. ఓ విద్యార్థి చదువులో వెనకబడడంతో అతడిని పలుమార్లు శ్యామ్ హెచ్చరించాడు. పరీక్షలలో మార్కులు సరిగ్గా రాకపోవడంతో వెనక బెంచీలో కుర్చున్న సదురు విద్యార్థిని ముందు బెంచీలో కూర్చోబెట్టాడు. దీంతో ఆ టీచర్ పై సదరు విద్యార్థి పగపెంచుకున్నాడు. ఇంట్లో నుంచి కత్తి తీసుకొచ్చి టీచర్ మెడ, కడుపులో పొడిచాడు. వెంటనే విద్యార్థి అక్కడి నుంచి పారిపోయాడు. తోటీ ఉపాద్యాయులు ఆ టీచర్ ను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రధానోపాద్యాయుడు సమాచారం మేరకు ఎసిపి ఖాసీమ్ అబిది అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి తండ్రి టైలర్ గా పని చేస్తున్నాడు. ఓ మర్డర్ కేసులో విద్యార్థి బాబాయి, మేనమామ జైలులో ఉన్నారు.

 

Uttar Pradesh Student attack on Teacher with Knife
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News