Sunday, April 28, 2024

ఆర్టీసీ క్రాస్ రోడ్డులో విద్యార్థులపైకి దూసుకెళ్లిన లారీ… ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ఆర్ టిసి క్రాస్ రోడ్డు దగ్గర శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ పై వెళ్తున్న కాలేజీ విద్యార్థులపైకి లారీ దూసుకెళ్లడంతో ఒకరు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా వాహనాన్ని రోడ్డుపై నుంచి పక్కకు తొలగించారు. మృతుడు కరీంనగర్ జిల్లా కొండగట్టు కు చెందిన గుంటి అజయ్ గా గుర్తించారు. రామ్ నగర్ లోని పయనీర్ ఇన్సిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో అజయ్  చదువుకుంటున్నాడు.

 

Student Died in Lorry Accident in RTC X Road
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News