Friday, June 20, 2025

యోగా చేస్తే యోగ్యులు అవుతారు: వెంకయ్యనాయుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యోగా చేస్తే యోగ్యులు అవుతారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. ఎల్బి స్టేడియంలో జరిగిన యోగా కౌంట్‌డౌన్ కార్యక్రమంలో భాగంగా వెంకయ్యనాయుడు మాట్లాడారు. మానసిక శక్తులను ఏకం చేసేది యోగా అని ప్రశంసించారు. విశ్వమంతా పరిపూర్ణ ఆరోగ్యంతో, శాంతితో ముందుకు సాగాలన్నదే యోగ దినోత్సవ సంకల్పమని స్పష్టం చేశారు. యోగాకు మతం లేదు జాతి లేదని, యోగా మన జీవన విధానమని తెలియజేశారు. ప్రపంచంలోనే అద్భుత సాహసం ఆపరేషన్ సింధూర్ అని కొనియాడారు.

ఒకే భూమి… ఒకటే ఆరోగ్యం కోసం యోగ అని అనే సంకల్పంతో ఈ ఏడాది యోగ దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందని, మనమంతా ఇదే సంకల్పాన్ని తీసుకుని వసుధైవ కుటుంబ భావనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది యోగ మార్గాన్ని సాధన చేస్తూ ముందుకు సాగుతున్నారని,  విదేశీయులంతా యోగ మార్గాన్ని తలకెత్తుకుని ముందుకు సాగుతుంటే, ఈ నేల మీద పుట్టిన మనం యోగ మార్గానికి ఇంకెంత గౌరవం ఇవ్వాలో ఒక్కసారి ఆలోచించుకోవాలని, యోగ మార్గాన్ని అనుసరించవలసిందిగా వెంకయ్యనాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, వెంకయ్యనాయుడు..కిషన్‌రెడ్డి, భూపతిరాజు శ్రీనివాసవర్మ, సినీనటులు కుష్బూ, మీనాక్షి చౌదరి హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News