హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడి పదవికి తాను సిద్ధంగా ఉన్నట్లు మాజి ఎంపి హనుమంతరావు వెల్లడించారు. తాను రాజీవ్ గాంధీ సిఫాయిగా పేర్కొంటూ, పిసిసి అధ్యక్ష పదవి రేసులు ఉన్నామని వివరించారు. తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవికి జిల్లాల్లో కేడర్ అభిప్రాయాలను తెలుసుకోవాలని సూచించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కర్ణాటక తరహా రాష్ట్రంలో పిసిసి పదవి నియామకం కోసం అభిప్రాయ సేకరణ చేయాలని పార్టీ అధిష్టానానికి సలహా ఇచ్చారు. సిఎంకెసిఆర్ బీసిలకు ఆత్మ గౌరవ భవనాలు కట్టిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. పిసిసి అధ్యక్షపదవి విషయంలో వయోపరిమితిని సాకుగా చూపుతున్నారని ఆరోపించారు. బీసిలు పిసిసి అధ్యక్ష పదవి నిర్వహించేందుకు సహాకరించాలని ఆగ్ర వర్ణ నేతలను ఆయన కోరారు. ఈనెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ టోర్నిలో 12 రాష్ట్రాలు, నాలుగు దేశాలకు చెందిన క్రికెట్ జట్లు పాల్గొంటున్నాయని తెలిపారు.