Sunday, April 28, 2024

ప్రేక్షకులకు థాంక్స్ చెప్పిన హీరో విజయ్ దేవరకొండ

- Advertisement -
- Advertisement -

విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఖుషి సినిమా…టాలీవుడ్ కు రీసెంట్ బ్లాక్ బస్టర్ అందించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. నమ్మకాలు, సంప్రదాయాలు వేరైనా అవి…ఒక జంట ప్రేమకు అడ్డురావనే సందేశాన్నిస్తూ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఖుషిని రూపొందించారు దర్శకుడు శివ నిర్వాణ. సెప్టెంబర్ 1 పాన్ ఇండియా మూవీగా థియేటర్స్ లో రిలీజై ఘన విజయాన్ని సాధించింది ఖుషి. విప్లవ్ గా విజయ్, ఆరాధ్యగా సమంత నటన ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఖుషి సినిమా రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ ద్వారా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది.

హిందీ సహా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో ఖుషికి నెట్ ఫ్లిక్స్ లో సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఖుషి నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో ఉంది. తమ సినిమాకు ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ పట్ల సంతోషాన్ని, సంతృప్తిని వ్యక్తం చేశారు హీరో విజయ్ దేవరకొండ. ఆయన ప్రేక్షకులకు థాంక్స్ చెప్పారు.

విజయ్ దేవరకొండ స్పందిస్తూ – ప్రేమకు భాష లేదు, ఎమోషన్స్ కు బౌండరీస్ లేవనే నమ్మకంతో ఖుషి సినిమా చేశాం. థియేటర్స్ లో మీరు ఖుషికి చూపించిన ఆదరణకు తోడు ఇవాళ ఓటీటీలో మీరు అందిస్తున్న ప్రేమ చాలా సంతోషాన్నిస్తోంది. ఖుషి మాకు అందించిన ఆనందాన్నే మీకూ అందిస్తోందని ఆశిస్తున్నా. ప్రేక్షకులందరికి నా కృతజ్ఞతలు. అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News