హైదరాబాద్: లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి పదమూడు సంవత్సరాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో సినీ పరిశ్రమలోకి రీఎంట్రీ ఇచ్చింది. సంక్రాంతి కానుకగా విడుదలై ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ మూవీలో తన నటనతో మరోసారి ప్రేక్షకులను మెప్పించిన విజయశాంతిపై అభిమనులు, ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. ఇన్ని సంత్సరాల తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆమెకు అభిమానులు, ప్రేక్షకులు సాదర స్వాగతం పలికారు. దీంతో, ఇకనుంచి విజయశాంతి వరుసగా సినిమాలు చేస్తుందనుకుంటున్న తరుణంలో ఇటీవల ఆమె చేసిన ట్వీట్స్ తో ఆమె మళ్లీ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ”సరిలేరు మీకెవ్వరు. ఇంత గొప్ప విజయాన్ని నాకు అందించిన, ఎల్లప్పుడూ నన్ను ఆదరిస్తూ వస్తున్న అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. నా నట ప్రస్థానానికి 1979 ‘కుళ్ళుకుల్ ఇరమ్’, ‘కిలాడి కృష్ణుడు’ నుంచి 2020 ‘సరిలేరు నీకెవ్వరు’ వరకూ ఆ గౌరవాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ప్రజా జీవన పోరాటలో నా ప్రయాణం.. మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం నాకు కన్పిస్తోందో, లేదో నాకు కూడా తెలియదు. ఇప్పటికి ఇక సెలవు. మనస్సు నిండిన మీ ఆదరణకు, నా ప్రాణప్రదమైన అభిమాన సైన్యానికి ఎప్పటికీ నమస్సులు. సూపర్ స్టార్ కృష్ణ గారు, మహేష్ బాబు గారు, అనిల్ రావుపూడి గారికి కృతజ్ఞతలు” అని ట్వీట్ చేసింది.
Thank You
#సూపర్_స్టార్_కృష్ణగారు #సూపర్_స్టార్_మహేష్_గారు…and #అనిల్_రావిపూడిగారు.— VIJAYASHANTHI (@vijayashanthi_m) February 2, 2020
Vijayshanthi tweeted on her Next Films