Monday, May 6, 2024

స్వామి చిన్మయానందకు బెయిల్ మంజూరు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: న్యాయ విద్యార్థినిపై అత్యాచారం కేసులో నిందితుడైన మాజీ కేంద్రమంత్రి, బిజెపి నాయకుడు స్వామి చిన్మయానందకు అలహాబాద్ హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. చిన్మయానంద యజమానిగా వ్యవహరిస్తున్న యుపిలోని షాజహాన్‌పూర్‌లోగల ఎస్‌ఎస్ న్యాయ కళాశాలో బాధిత మహిళ న్యాయ శాస్త్రం చదువుతోంది. తనపై చిన్మయానంద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె గతంలో ఆరోపించింది. ఆమె ఫిర్యాదులను పురస్కరించుకుని చిన్మయానందను గత ఏడాది సెప్టెంబర్ 20న పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి చిన్మయానంద జైలులో ఉన్నారు.

HC grants bail to Chinmayanand

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News