Tuesday, May 7, 2024

వినాయక నిమజ్జనానికి ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

భాగ్యనగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు

ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ట్రాఫిక్​ ఆంక్షలు..

శనివారం అర్ధరాత్రి నుంచే నగరంలోని అంతర్రాష్ట్ర, జిల్లాల లారీల ప్రవేశంపై నిషిద్ధం.

ఆర్టీసీ బస్సులను సైతం పలుచోట్ల దారి మళ్లింపు.

Vinayaka nimajjanam 2021

హైదరాబాద్: వినాయక నిమజ్జనం సందర్భంగా ఆదివారం హైదరాబాద్ వ్యాప్తంగా పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు గణేష్ నిమజ్జన యాత్ర మీదుగా కాకుండా ప్రత్యామ్నయ దారుల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. నగర ప్రజల కోసం కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు.  వాహనాల దారి మల్లింపు, ట్రాఫిక్ ఆంక్షల గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు 040-27852482, 9490598985, 9010303626 నెంబర్లకు ఫోన్ చేయొచ్చని పోలీస్ సూచనలు చేశారు. గూగుల్ మ్యాప్​లో ట్రాఫిక్ రద్దీపై ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేలా ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. ప్రతి శోభాయాత్ర మార్గంలో పోలీసులు అడుగడుగునా పర్యవేక్షిస్తారు. విగ్రహాలు తరలించే వాహనాలకు కలర్ కోడింగ్ ఇచ్చామన్నారు. బ్లూ, ఆరెంజ్, రెడ్, గ్రీన్ కేటాయించిన కలర్ ఆధారంగా రూట్ మ్యాప్ ను ట్రాఫిక్ పోలీసులు సిద్దం చేశారు.

గణేష్ నిమజ్జన గూగుల్ రూట్ మ్యాప్- ట్రాఫిక్ ఆంక్షలు

Vinayaka nimajjanam 2021

బాలాపూర్, ఫలకనుమా, చార్మినార్ నుంచి వచ్చే వినాయక విగ్రహాలను అఫ్జల్​గంజ్, గౌలీగూడా చమాన్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్​బాగ్ మీదుగా ట్యాంక్ బండ్ లేదా ఎన్​టీఆర్​ మార్గ్ ద్వారా తరలిస్తారు. బేగం బజార్, ఉస్మాన్ గంజ్ , అఫ్జల్​గంజ్ గౌలిగూడా మీదుగా శోభాయాత్రకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు.

సికింద్రాబాద్ నుంచి వచ్చే శోభాయాత్ర ఆర్పీ రోడ్, కర్బాల మైదానం, కవాడిగుడ, ముషీరాబాద్ కూడలి, హిమయత్ నగర్ జంక్షన్, లిబర్టీ మీదుగా ట్యాంక్ బ్యాండ్ లేదా ఎన్​టీఆర్ మార్గ్ వైపు విగ్రహాల మళ్లిస్తారు.

ఉప్పల్ నుంచి వచ్చే శోభాయాత్ర రామాంతపూర్, అంబర్​పేట కూడలి, శివంరోడ్, ఫీవర్ ఆస్పత్రి, నారాయణగూడ కూడలి, లిబర్టీ మీదుగా కొనసాగేలా ఏర్పాట్లు చేశారు.

  దిల్​సుఖ్​నగర్, ఐఎస్​ సదన్ వైపు నుంచి వచ్చే శోభాయాత్ర సైదాబాద్, నల్గొండ క్రాస్ రోడ్, చాదర్ ఘాట్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బసీర్ బాగ్ మీదుగా ట్యాంక్ బండ్ లేద ఎన్ టిఆర్ మార్గ్ కు తరలిస్తారు.

టోలిచౌకి, రేతి బౌలి, మెహదీపట్నం నుంచి వచ్చే శోభాయాత్ర మాసబ్ ట్యాంక్, నిరంకారి భవన్ మీదుగా ఎన్​టిఆర్​ మార్గ్​ వైపు మళ్లిస్తారు.

మెహదిపట్నం, తపచ్ బుత్రా, అసిఫ్ నగర్ వైపు నుంచి వచ్చే శోభయాత్ర సీతారాంబాగ్, బోయగుడ కమాన్, గోశామహల్ బారదారి, ఎంజె మార్కెట్ మీదుగా ముందుకు వెళ్లనున్నాయి.  ఈ రూట్ మ్యాప్ లో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లానని పోలీసులు సూచించారు.

ఎర్రగడ్డ, ఎస్ ఆర్ నగర్ నుంచి వచ్చే శోభాయాత్ర అమీర్​పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్ మీదుగా ఎన్​టిఆర్​ మార్గ్​కు చేరుకోనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News