Friday, May 10, 2024

ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్‌ను బిజెపి అధిష్టానం ఎంపిక చేసింది. 54 మంది బిజెపి ఎంఎల్‌ఎలతో బిజెపి అగ్ర నేతలు సమావేశమై చర్చలు జరిపారు. బిజెపి ఎంఎల్‌ఎలు సాయ్‌ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. విష్ణుదేవ్ గతంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించారు. 2014లో ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి 54 సీట్లు, కాంగ్రెస్ 35 స్థానాలు, ఇతరులు ఒకటి గెలుచుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News