- Advertisement -
న్యూఢిల్లీ : విస్టాడోమ్ కోచ్లతో రూపొందించిన టూరిస్టు రైలు ప్రయాణం చిరస్మరణీయమని ప్రధానిమోడీ అభివర్ణించారు. ఈ రైలులో మొత్తం 44 సీట్లు ఉన్నాయి. ఇవి 180 డిగ్రీల కోణంలో పరిభ్రమిస్తాయి. కోచ్ల పైకప్పు గాజులా పారదర్శకంగా ఉండి ప్రకృతిని వీక్షించడానికి వీలుగా ఉంటుంది. కోచ్లో వైఫై సమాచార వ్యవస్థ, గ్లాస్ విండోస్, సీటు దిగువన మొబైల్ ఛార్జింగ్ సాకెట్, ఫ్లషింగ్ టాయిలెట్లు, వికలాంగులు వీల్ఛైర్తో ప్రవేశించడానికి వీలుగా తెరుచుకునే ప్రవేశ ద్వారాలు తదితర అధునాతన హంగులతో ఈ రైలును తీర్చి దిద్దినందుకు రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ను ప్రధాని అభినందించారు.
- Advertisement -