Friday, May 3, 2024

నకిరేకల్‌లో చంద్రబాబు కు ఘన స్వాగతం

- Advertisement -
- Advertisement -

నకిరేకల్ : ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు హైదరాబాద్ నుండి వెళ్తున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కు బుధవారం నకిరేకల్ బైపాస్‌లో స్థానిక టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో టిడిపిని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ ఇంచార్జి యాతాకుల అంజయ్య, భువనగిరి నియోజకవర్గ పార్లమెంట్ కన్వీనర్ నక్క రాంభనేష్, మండల అధ్యక్షుడు పసుపులేటి కృష్ణారెడ్డి, దోనాల వెంకట్‌రెడ్డి, దొమ్మాటి సైదులు తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News