Saturday, April 27, 2024

వాణిజ్య కనెక్షన్లపై జలమండలి ప్రత్యేక ఫోకస్

- Advertisement -
- Advertisement -
Water board Special Focus on Commercial Connection
ఆన్‌లైన్‌లో బిల్లుల జారీ,వసూల దిశగా చర్యలు
ఏప్రిల్ 1 నుంచి ఆన్‌లైన్‌లో వాణిజ్య కనెక్షన్ల బిల్లుల చెల్లింపు
రెవెన్యూ సమీక్షలో జలమండలి ఎండీ దానకిషోర్

హైదరాబాద్: వాణిజ్య కనెక్షన్ల బిల్లుల జారీ, వసూలు ఆన్‌లైన్ ద్వారా జరపాలని నిర్ణయించినట్లు జలమండలి ఎండీ దానకిషోర్ వెల్లడించారు. దశలవారీగా ప్రక్రియ ప్రారంభించి ఏప్రిల్ 1వ తేదీ నుంచి వందశాతం ఆన్‌లైన్‌లో బిల్లుల జారీ చేసి, ఆన్‌లైన్ ద్వారానే వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బుధవారం జలమండలి ప్రధాన కార్యాలయంలో సీజీఎంలు, జీఎంలతో ఆయన రెవెన్యూపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ఇప్పటికి అన్ని పైప్‌సైజు కలిగిన నాన్ డొమెస్టిక్ కనెక్షన్లను గుర్తించి, జియో ట్యాంగింగ్ చేసినట్లు, ఈకనెక్షన్లకు ఆన్‌లైన్‌లో బిల్లులు జారీ చేసి, డిజిటల్ పద్దతిలో వసూలు చేసే విధానంపై ఇప్పటికే ఒక అధికారుల కమిటీ వేసి అధ్యయనం చేయించినట్లు తెలిపారు.

వాణిజ్య కనెక్షన్లకు ఈమెయిల్, ఎస్‌ఎంఎస్, వాట్సాప్ వంటి మాధ్యమాల ద్వారా పూర్తిగా ఆన్‌లైన్‌లో బిల్లులు జారీ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈబిల్లులు కూడా ఆన్‌లైన్‌లో వసూలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటి నుంచి ఈప్రక్రియను ప్రారంభించి క్రమంగా ఏప్రిల్ 1 నాటికి పూర్తి స్దాయిలో అమలు చేస్తామన్నారు. మీటరు పనిచేయని, మీటరు లేని వాణిజ్య హైవాల్యూ కనెక్షన్లకు ఖచ్చితంగా మీటర్లు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి లోపు వీరు తప్పకుండా ఏఎంఆర్ మీటర్లు అమర్చుకునేలా చూడాలని పేర్కొన్నారు. వాణిజ్య కనెక్షన్ల బకాయిలను పూర్తి స్దాయిలో వసూలు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఇంతవరకు బిల్లులు చెల్లించని కనెక్షన్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, కచ్చితంగా వీరు బిల్లులు చెల్లించేలా చూడాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News