Tuesday, April 30, 2024

జైల్లో ఉన్న కవితను మళ్లీ అరెస్టు చేయడమేంటి?

- Advertisement -
- Advertisement -

ఓ కేసులో జైలులో ఉన్నవారిని, మరో కేసులో అరెస్టు చేసేందుకు వీలు కల్పించేదే పిటి వారెంట్

రెండింట్లోనూ బెయిల్ వస్తేనే.. జైలు నుంచి బయటికి

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఇప్పటికే అరెస్టయి.. తీహార్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను.. తాజాగా సిబిఐ పిటి వారెంట్ తో అరెస్టు చేసింది. ఏదైనా కేసులో ఇప్పటికే అరెస్టయి జైలులో ఉన్న నిందితులను… మరో కేసులో అరెస్టు చేసేందుకు, లేదా అదే వ్యవహారంపై విచారణ జరుపుతున్న మరో దర్యాప్తు సంస్థ అరెస్టు చేసేందుకు వీలు కల్పించేదే ‘ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్’(పిటి వారెంట్).

నిందితులను వేరే కేసులో అరెస్టు చేయాల్సి వస్తే.. పోలీసులు సదరు కోర్టుకు వెళ్లి అనుమతి కోరుతారు. ఏ కేసులో, ఎందుకు అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నదో వివరిస్తారు.  ‘ప్రిజనర్ ట్రాన్సిట్ వారంట్’  ఇచ్చి ఆ నిందితులను తమకు అప్పగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు.

పోలీసులు నిందితులను ట్రాన్సిట్ వారంట్ పై అరెస్టు చేసినా.. నిబంధనల ప్రకారం 24 గంటలలోగా తాము దర్యాప్తు చేస్తున్న ఆ మరో కేసుకు సంబంధించిన కోర్టులో హాజరుపర్చాల్సి ఉంటుంది. ఈ కోర్టు నిందితులకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తే.. ఈ కోర్టు పరిధిలోని జైలుకు తరలించాల్సి ఉంటుంది. ఒకవేళ పోలీసు కస్టడీకి ఈ కోర్టు అనుమతి ఇస్తే.. ఆ గడువు వరకు పోలీసుల నిందితులను తీసుకెళ్లి వివరంగా ప్రశ్నించేందుకు అవకాశం ఉంటుంది. ఇలా పిటి వారంట్ పై ఉన్న నిందితులకు.. అన్ని కేసుల్లో బెయిల్ వస్తేనే జైలు నుంచి విడుదల అవుతారు. లేకుంటే జైల్లోనే ఉండాల్సి వస్తుంది.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News