Monday, April 29, 2024

మత్తు పదార్థాల మీద ఉక్కుపాదం మోపుతాం

- Advertisement -
- Advertisement -

శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు
మహిళా సంరక్షణ, సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యం : సిపి తరుణ్ జోషి
మన తెలంగాణ/హైదరాబాద్ :నేరేడుమెట్ సిపి కార్యాలయంలో రాచకొండ నూతన కమిషనర్‌గా నియమితులైన తరుణ్ జోషి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాచకొండలో పని చేస్తున్న డిసిపి, ఎసిపి, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాచకొండ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా, ప్రాణాపాయం కలిగించే తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. త్వరిత గతిన నేరనిరూపణకు కృషి చేస్తామని పేర్కొన్నారు. సివిల్, ఎఆర్, బెటాలియన్, ట్రాఫిక్ వంటి అన్ని విభాగాలను సమన్వయంతో పని చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

మహిళా సంరక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని, షీ టీమ్స్ బృందాలను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. డ్రగ్స్ సరఫరా, వినియోగం మీద ఉక్కుపాదం మోపుతామని, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని, ప్రజలలో సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. గతంలో రాచకొండ అదనపు కమిషనర్ గా పని చేసిన అనుభవంతో రాచకొండ పరిధిలోని అన్ని ప్రాంతాల మీద సంపూర్ణ అవగాహన ఉందని, మూడు కమిషన రేట్లతో సమన్వయంతో కలిసి పనిచేస్తామని, ప్రజలకు ఎల్లవేళలా సేవలందిస్తామని, ప్రజా సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేలా చూస్తామని పేర్కొన్నారు. నేరాలను అరికట్టడంలో అందరితో కలిసికట్టుగా పనిచేస్తామని, పోలీస్ సిబ్బంది సంక్షేమంపై కూడా దృష్టి సారిస్తామని ప్రత్యేకంగా పేర్కొన్నారు. ప్రజలు నేర భయం లేకుండా ఉండాలంటే అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి నేరాలను అదుపు చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి డిసిపి రాజేష్ చంద్ర, మల్కాజ్‌గిరి డిసిపి పద్మజ, ఎల్బీనగర్ డిసిపి ప్రవీణ్ కుమార్, ఎస్బీ డిసిపి కరుణా కర్, అడ్మిన్ డిసిపి ఇందిర, ఎస్వోటీ డిసిపి మురళీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News