Sunday, April 28, 2024

బస్సు కిందపడి మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

ప్రమాదవశాత్తు ఓ మహిళ బస్సు కిందపడి మృతిచెందిన సంఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…నల్లకుంటకు చెందిన లలిత(55) అడిక్‌మెట్ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా కాలుజారి ప్రమాదవశాత్తు చక్రాల కిందపడింది. ఆమెపై నుంచి బస్సు వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది, ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. లలిత భర్త వెంకటస్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News