Monday, May 6, 2024

అనుమానస్పస్థితిలో మహిళ మృతి

- Advertisement -
- Advertisement -
woman dies under suspicious in hyderabad
కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

హైదరాబాద్: అనుమానస్పదస్థితిలో మహిళ మృతిచెందిన సంఘటన నగరంలోని ఈద్ బజార్‌లో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం…. నస్రీన్ బేగం(38) క్లాత్ స్టోర్‌లో పనిచేస్తోంది. బాధితురాలికి ఎండి గౌస్‌తో వివాహం జరగగా వారికి కుమారుడు సోహైల్(20), కూతురు సమ్రీన్‌బేగం(19) ఉన్నారు. భర్యాభర్తల మధ్య మనస్పర్దలు రావడంతో ఏడేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. తర్వాత వారిస్ అలీ అలియాస్ సికెందర్‌ను మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. ఇద్దరు కలిసి మొదటి భర్త పిల్లలతో జావీద్ నగర్, ఈద్ బజార్‌లో ఉంటున్నారు. ఇంట్లో బాధితురాలు వంట చేస్తుండగా భర్త పనికోసం బయటికి వెళ్లాడు. బాధితురాలి కుమారుడు ఇంటికి వచ్చే సరికి వంటగదిలో కిందపడి ఉంది. నస్రీన్ బేగం తలకు గాయం అయి ఉంది. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. బాధితురాలి పిల్లల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News