Tuesday, May 7, 2024

పిఎఫ్ డబ్బులు రావడంలేదని మహిళ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అపోలో ఆస్పత్రిలో పనిచేసిన బాధితురాలు

Women suicide for PF Money in Hyderabad

మనతెలంగాణ, సిటిబ్యూరో: ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు రావడంలేదని మనస్థాపం చెందిన మహిళ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిలింనగర్ ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…ఫిలింనగర్‌కు చెందిన సంగీత అపోలో ఆస్పత్రిలో హౌస్‌కీపింగ్ పనిచేసింది. గత ఏడాది కరోనా వల్ల సంగీతను ఉద్యోగంలో నుంచి తీసివేశారు. అప్పటి నుంచి పిఎఫ్ డబ్బుల కోసం ఏడాది నుంచి తిరుగుతున్నది. ఏడాది నుంచి తిరుగుతున్నా డబ్బులు రాకపోవడంతో మనస్థాపం చెంది కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతిచెందింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News