Thursday, May 2, 2024

ఐఒసి డిపోలో పేలుడు… వెల్డింగ్ వర్కర్ మృతి

- Advertisement -
- Advertisement -

చెన్నై: చెన్నై లోని తొండియార్‌పేట్ ఏరియాలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ( ఐఒసి) డిపోలో బుధవారం పేలుడు సంభవించి ఒకరు చనిపోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు పెరుమాళ్ వెల్డింగ్ వర్కర్. గాయపడిన వ్యక్తిని సమీపాన ఆస్పత్రిలో చేర్చారు. రెండు ఇథనాల్ ట్యాంకుల మరమ్మతు చేస్తుండగా పేలుడు సంభవించినట్టు పోలీస్‌లు చెప్పారు. తక్షణం అగ్నిప్రమాదం నుంచి భద్రతా చర్యలు తీసుకున్నారు. భద్రత ప్రమాణాల దృష్టా ఆ ప్రాంతమంతా దిగ్బంధం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News