- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : క్యూ న్యూస్ ఉద్యోగి మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్పై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో బుధవారంనాడు ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మానేని రిట్ పిటిషన్ దాఖలు చేశారు. క్యూ న్యూస్ అనే సామాజిక మాధ్యమాన్ని మూసే విధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయవాది పిటిషన్లో కోరారు. క్యూ న్యూస్ ద్వారా ప్రభుత్వాన్ని కించపరుస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న నవీన్పై చర్యలు తీసుకోవాలని న్యాయవాది పేర్కొన్నారు. నవీన్కుమార్ క్యూ న్యూస్ అనే సామాజిక మాధ్యమం ద్వారా విషప్రచారం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని న్యాయస్థానానికి తెలిపారు. పిటిషన్ను స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 6న చేపట్టనుంది.
- Advertisement -